కాశ్మీర్ ను అమ్మేస్తారు.. పాక్ షాకింగ్ స్టేట్మెంట్?

praveen
భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడూ పాకిస్తాన్ డబుల్ గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. 370 ఆర్టికల్ రద్దు కు ముందు కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులే. ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి ఉగ్రవాదులు దాడి చేస్తారో అని అక్కడి ప్రజలు పోలీసులు భయంతో బ్రతికే  పరిస్థితులు ఏర్పడ్డాయి.. కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసింది. 370 ఆర్టికల్ రద్దు చేసిన సమయంలో కాశ్మీర్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ భారత్ వ్యూహాత్మకంగా వ్యవహ రించడంతో అదీ కుదరలేదు.



 ఇక ఇప్పుడు కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. యువతకు ఉద్యోగ కల్పన మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. ఇక కాశ్మీరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాకిస్తాన్ కుల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలోనే కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఇలాంటి సమయంలో ఇక అటు పాకిస్థాన్ ప్రభుత్వం కాకుండా అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 పాకిస్తాన్లోని జెమియత్ ఉలేమా  ఈ ఇస్లామ్ చీఫ్ మౌలానా వర్జుర్ రెహమాన్.. స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాశ్మీర్ ప్రాంతం విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని.. కాశ్మీరు భారత్కు అమ్మేశారని.. అందుకే ఇప్పటివరకు కాశ్మీర్ ప్రాంతం గురించి ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోవడంలేదని.. ఆ ప్రాంతం కోసం ఏమీ చేయడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు.  ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వచ్చేది ఏమీ లేదని ఇక రానున్న రోజుల్లో మేమే కాశ్మీర్ విషయంలో ముందుకు సాగుతాం అంటూ స్టేట్మెంట్లో పేర్కొనడం  సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: