గుడ్ న్యూస్ : గడువు పొడిగించిన కేంద్రం?
దీంతో వర్క్ ఫ్రం హోం వచ్చిందని అందరూ ఎంతగానో సంబరపడిపోయారు. ఓ దేవుడా కరుణించవా.. మా కోరిక ఇన్నాళ్లకు తీర్చవా స్వామీ అంటూ మురిసి పోయారు. కానీ కొన్నాళ్ళకే వర్క్ ఫ్రం హోం పైన విరక్తి వచ్చేసింది అందరికీ. ఆఫీసులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆశగా చూడటం మొదలుపెట్టాడు. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ మాత్రం ఎక్కడ తగ్గుముఖం పట్టడంలేదు.. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. కేవలం ప్రైవేటు ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సెక్రెటరీ కంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఇది వర్తించనుంది అంటూ చెప్పుకొచ్చింది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్ని ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో 50 శాతం కెపాసిటీ తో మాత్రమే నడుస్తున్నాయి. 50 శాతం మంది ఉద్యోగుల్లో గర్భిణీలు దివ్యాంగులు లాంటి ఉద్యోగులు ఉన్నారు. ఇక వీరు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటి నుంచి పని చేయవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.