డబ్ల్యూహెచ్ఓ ఇలా చేసిందేంటి.. జమ్ము కాశ్మీర్ పాకిస్తాన్ లోనట?
ఇది ఈ తెలిసిన భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే పలుమార్లు భారత్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చేయడం గమనార్హం.. ఇక ఇప్పుడు ఇలాంటి తప్పు మరోసారి పునరావృతం కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారూ కొంతమంది. కోవిడ్ 19 అంతర్జాతీయ వెబ్ సైట్ లో భారత మ్యాప్ ను తప్పు గా చూపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
జమ్మూ కాశ్మీర్ను భారత్లో ప్రాంతంగా కాకుండా పాకిస్తాన్ చైనాలకు సంబంధించిన ప్రాంతాలుగా మ్యాప్ లో చూపించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాసారు ఆయన. భారత్లోని జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని డబ్ల్యుహెచ్వో విడుదల చేసిన చిత్రపటంలో పాకిస్తాన్ చైనాల కు చెందినదిగా చూపిస్తున్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ నుంచి విడిగా చూపినట్టు ఆరోపించారు ఆయన. దీన్ని తీవ్రమైన అంతర్జాతీయ సమస్యగా భావిస్తున్నానని కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు ఆయన.