గ్రీన్ సిగ్నల్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు మరో బూమ్..?
అయితే.. ఈ ప్రాజెక్టులో ఇటీవల పురోగతి కాస్త మందగించిందన్న అంసతృప్తి రియల్టర్లలో ఉన్న నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. రీజనల్ రింగ్ రోడ్.. ఆర్.ఆర్.ఆర్ తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియకు కేంద్రం పచ్చజెండా ఊపేసింది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. భూసేకరణకు పచ్చజెండా ఊపడం అంటే ప్రాజెక్టు చాలావరకూ ముందుకు కదిలినట్టే.
ఈ రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్లను పరిశీలించిన కేంద్రం తాజాగా ప్రాజెక్టునకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. భారీ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణం చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ను 25 నుంచి 30 సంవత్సరాల ట్రాఫిక్ అంచనాలతో నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
ఈ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 338 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. అయితే భూసేకరణకు అనుమతి వచ్చింది.. 157 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మాత్రమే.. ఈ దారికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంకా చౌటుప్పల్- చేవెళ్ల-శంకర్పల్లి-ఆమనగల్-సంగారెడ్డి మీదుగా 181 కిలోమీటర్ల రహదారికి మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు.