ఘాటు ప్రేమ.. లేటు ప్రేమ.. ఏకంగా 65 ఏళ్ల వయసులో?

praveen
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమే. ఒక్కసారి ప్రేమలో పడితే ఆ మధురానుభూతి మాటల్లో కూడా చెప్పలేని విధంగా ఉంటుంది అని ప్రేమికులు చెప్పే మాట. ప్రేమ గురించి వర్ణించడానికి బొమ్మరిల్లు సినిమా లోని ఒక పాట సరిగ్గా సరిపోతుంది. కన్నులు మూసి కలగంటాం అని ప్రేమికులు అంటుంటే.. అయ్యో పాపం పిచ్చి ఏమో అని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ప్రేమలో పడ్డాక నాది అదే పరిస్థితి.. పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులు అంటుంటే.. అయ్యో పాపం మతి పోయింది అని అనుకున్నాను.. కానీ ఇప్పుడు నాది అదే పరిస్థితి అంటూ ఈ పాట సాగిపోతూ ఉంటుంది.

 అచ్చం  నిజజీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది.. కొంతమంది ప్రేమికులను చూసి వీళ్ళకి ఏమైనా పిచ్చా అని అనుకుంటూ ఉంటారు జనాలు. కానీ ఆ ప్రేమ లో ఉండే మధురానుభూతి మాత్రం ప్రేమలో మునిగి తేలుతున్న ఆ జంటకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఓ జంట ప్రేమకు ప్రతిరూపంగా మారిపోయింది. ఇక వీరి లవ్ స్టోరీని ఒక సినిమాగా కూడా తీయొచ్చు అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ విన్న తర్వాత.. ఎన్నేళ్లు గడిచినా ఒక వ్యక్తి పై ఉన్న ప్రేమ పోదు అన్న విషయానికి ఇక వీళ్ల ప్రేమే నిదర్శనంగా మారిపోయింది.

 యుక్తవయసులో వీరి మధ్య పుట్టిన ప్రేమ 65 ఏళ్ల వయసులో వీరిని భార్య భర్తలు గా చేసింది. ఒకరంటే ఒకరికి గాఢమైన ప్రేమ అని అనుకోని సంఘటనల కారణంగా ఆమెకు యుక్త వయసులోనే ఒకరితో పెళ్లి చేశారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి దక్కలేదు అన్న బాధతో ఆ వ్యక్తి పెళ్లికి దూరంగా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. పెళ్లైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు కూడా కాలేదు. దీంతో ఇక వారి ప్రేమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడిపారు ఇద్దరు ప్రేమికులు. వేరు వేరుగా ఉంటున్నా ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికారు. చివరికి  సమాజం గురించి ఆలోచించకుండా 65 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని మండియా జిల్లా మేల్కోటే లో వెలుగులోకి వచ్చింది. చిక్కన్న, జయమ్మ అనే వృద్ధులు 65 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: