జగనుకు మోడీ భయం పట్టుకుంది ?
ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేసాం... రాజధాని ఇక్కడే ఉండాలని మేము అభివృద్ధి చేస్తున్నామన్నారు సోము వీర్రాజు. ఏపీలో రూ. 2500 కోట్లు రాజధానికి ఇచ్చాం.. రూ. 4700 కోట్ల రుణం ఇప్పించామనీ.. రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం.. గోతులు తవ్వే రాజకీయాలు చేయడం సరికాదన్నారు సోము వీర్రాజు. మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు..? రాజధానిపై ఇచ్చిన మాటను ఎందుకు తప్పారు..? రాజధాని నిర్మాణం పేరుతో రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు..? అని అగ్రహించారు సోము వీర్రాజు. రాజధాని నిర్మిస్తామని ఒకరు పారిపోయారు. అస్తవ్యస్తం నిర్ణయాలతో ఆంద్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు.. రాష్ట్ర అభి వృద్ధిపై ప్రభుత్వానికి చర్చకు రావాలని ఛాలెంజ్ విసురుతున్న.. మేము ఎంత పెంచామో ఎంత తగ్గించామో చాలా స్పష్టంగా చెప్పామనీ వేలాడించారు సోము వీర్రాజు.
ఎపి ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.