బాబు ఇంటికి వెళ్లి తంతా... వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
అసలు టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించు కునేలా ఉన్నాయన్న విషయం వాళ్లకు అర్థం కావడం లేదా ? అని ప్రశ్నించారు. హోం మంత్రి సుచరిత సైతం పట్టాభి వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఓ వైపు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తుంటే.. అది టీడీపీ నేతల కళ్లకు కనపడడం లేదా ? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని చెప్పారు.
చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని.. ఆయన ఫోన్ చేస్తే డీజీపీ స్పందించ లేదనడం కూడా పూర్తి అబద్ధమని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారిని అయినా వదలమని ఆమె హెచ్చరించారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు కేవలం అలజడులు క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఏపీలో జరుగుతోన్న సంక్షేమ పాలనను చూసి తట్టుకోలేకే చంద్రబాబు ప్రతి విషయం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అవంతి మండి పడ్డారు. పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతోన్న విషయం ఆయన తెలుసు కోవాలని సూచించారు. ఇక పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మ లను దహనం చేస్తున్నారు. చంద్రబాబు ఆయన అనుచరు లు , టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.