ఇండియన్ ఆర్మీ అలర్ట్.. సరిహద్దుల్లో డ్రగ్స్ కలకలం?

praveen
జమ్మూ కాశ్మీర్ లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు పరిస్థితులు హాట్ హాట్ గానే ఉంటాయ్. పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడేలా చేసి ఇక ఎన్నో రకాల ఉగ్ర కుట్రలు ప్లాన్ చేస్తూ ఉంటుంది  అయితే ఇటీవల కాలంలో అయితే అటు సరిహద్దుల్లో భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల దాడులకు అడ్డుకట్ట వేస్తోంది.ఎక్కడ ఉగ్రవాదులు అక్రమంగా భారత్ లోకి చొరబడకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో అటు ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేస్తుంది భారత ఆర్మీ.


 అయితే ఇప్పటికే భారత ఆర్మీ వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ అటు పాకిస్థాన్ నుంచి భారత్ కి అక్రమంగా ఆయుధాలను తరలించడం.. మాదకద్రవ్యాలను తరలించడం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. అటు భారత ఆర్మీ కళ్ళు కప్పి ఏదో ఒక విధంగా  అక్రమాలకు పాల్పడేందుకు అటు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  కానీ అటు ఇండియన్ బార్డర్ ఫోర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్ర వాదుల ఆటలు కట్టిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే మరోసారి సరిహద్దుల్లో భారీ డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారిపోయింది.



 నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి భారీ మొత్తంలో డ్రగ్స్ ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 25 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను అధికారులు సీజ్ చేయడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో loc వెంట ఒక ముఠా ఎంతో అనుమానం గా కనిపించింది. వారి కదలికలు కూడా అనుమానంగా కనిపించడంతో బలగాలు అప్రమత్తమయ్యారు. వెంటనే వారి దగ్గరికి సైన్యం వెళ్ళింది.  సైన్యం రావడాన్ని గమనించిన దుండగులు డ్రక్స్ అక్కడే వదిలేసి పారిపోయారు.  దీంతో ఇక ఆ మాదకద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. అయితే ఇక ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని భావిస్తున్నారు ఆర్మీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: