భారత్పై ఆఫ్ఘన్ హెరాయిన్ పంజా...!
కానీ తీగ లాగితే డొంక కదిలినట్లుగా... ఈ భారీ హెరాయిన్ డంప్ ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భారత్లోకి మాత్రం ఆఫ్ఘాన్ నుంచే హెరాయిన్ అక్రమ రవాణా పెరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి హెరాయిన్ అక్రమ రవాణ చేస్తున్న తాలిబన్లు... ప్రస్తుతం భూ, సముద్ర మార్గాల ద్వారా ఇతర దేశాలకు మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం భారత్లో మత్తు పదార్ధాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో హెరాయిన్ను అక్రమంగా స్మగ్లింగ్ చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. గుజరాత్లోని ముద్రా పోర్టులో లభించిన హెరాయిన్పైనే యాంటీ డ్రగ్, యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎలా వచ్చింది... ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలను కూపీ లాగుతున్నాయి ఏజెన్సీలు. పాకిస్తాన్ మీదుగా సముద్ర మార్గంలో ఈ హెరాయిన్ కంటైనర్లలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఇరాన్ చేరుకుని... అక్కడి నుంచి వయా పాకిస్తాన్ భారత్లోని ముద్రా పోర్టుకు సరుకు చేరినట్లు భావిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో భారత్లో సరుకు ఎవరు తెప్పించారనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.