జగన్ టార్గెట్ 2024: కేబినెట్లో ఫుల్ క్లారిటీ....!
సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన సహచరులతో కాసేపు ముచ్చటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తొలిసారి సరికొత్త కామెంట్ చేశారు. అదే టార్గెట్ 2024. ఇప్పుడు ఉండే మంత్రివర్గాన్ని మారుస్తున్నట్లు స్వయంగా మంత్రులకు చెప్పిన జగన్... 80 శాతం మందికి పదవి పోతుందని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో మీరంతా నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్న జగన్... ఈ రెండున్నరేళ్లు మీకు చేతినిండా పనుంది అని చెప్పేశారు. అదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా వారి వారి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటి నుంచి కృషి చేయాలని సూచించారు. ఇంకా చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే... మీకే లాభం జరుగుతుంది అంటూ తాయిలాలు కూడా ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధిద్దాం... మరింత లాభం పొందుదాం అనేలా జగన్ వ్యాఖ్యానించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉన్న వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే పదవులుంటాని క్లారిటీ ఇచ్చేశారు జగన్. చూడాలి ఆ అదృష్టవంతులు ఎవరో మరి.