చదువుల తల్లి సరస్వతి కష్టాలు..!
పూర్తి వివరాల్లోకి వెళితే ....కొమురం భీం జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడ లోని గిరిజన కుటుంబంలోని సరస్వతి అనే విద్యార్థిని మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. లాక్ డౌన్ తో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అయితే గిరిజన గూడెంలో సెల్ ఫోన్ సిగ్నల్ రాక క్లాసులు మిస్ అవుతుండటంతో తన తండ్రితో కలిసి రోజూ ఇంటి నుండి ఐదు కిలో మీటర్ల దూరం ప్రయాణించి క్లాసులను వింటోంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫోటో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్ లు పేరుకు తగ్గట్టుగా చదువుల తల్లి కష్టపడుతుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంత మంది సరస్వతి కష్టానికి తగ్గ ప్రతిఫలం భవిష్యత్తులో ఉంటుందని అంటున్నారు.