ఆడాళ్లంటే చిన్నచూపా.. వీళ్ల కథ చదవి సిగ్గుపడండి.. రియల్లీ గ్రేట్..!?
చివరకు సైన్యం వంటి వాటిలోనూ దూసుకుపోతున్నారు. అలాంటి ఓ మహిళా విజయ గాధే ఇది. తాజాగా శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వాణిజ్య విమానాన్ని అంతా ఆడవాళ్లే నడిపి శభాష్ అనిపించుకుంటున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలు దేరిన ఈ విమానం కాక్పిట్లో అంతా ఆడవాళ్లే.. ఈ విమానం పైలెట్లుగా కెప్టెన్ జోయా, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ శివాని, కెప్టెన్ ఆకాంక్ష చరిత్ర సృష్టించారు. ఉత్తరధ్రువం మీదుగా అట్లాంటిక్ను దాటుకొని ఈ విమానం బెంగళూరుకు రాబోతోంది.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్ స్టాప్గా 17 గంటలు ప్రయాణం జరగాల్సిఉంది. ఈ నాన్ స్టాప్ తొలి తొలి వాణిజ్య విమానాన్ని భారత మహిళా పైలెట్లే నడపుతున్నారు. శాన్ఫ్రాన్సిస్కో- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 17 గంటలపైనే. ఈ నగరాల మధ్య దూరం 13 వేల 993 కిలోమీటర్లు. ఈ విమానాన్ని నడిపే వారందరూ మహిళలేనని కేంద్ర మంత్రి కూడా గర్వంగా ప్రకటించారు. ఈ విమానం కాక్పిట్లో అందరూ మహిళలే ఉంటారంటూ విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ విమానాన్ని కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్, కెప్టెన్ శివాని మాన్హాస్ నడుపుతున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో లో బయలు దేరిన ఈ విమానం ఇండియన్ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున దిగుతుంది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. మరో రికార్డు ఏంటంటే. ప్రపంచంలోనే ఇండియా నడుపుతున్న అత్యంత దూర వాణిజ్య విమానం ఇదేనట.