శ్రీలంకకి వెళ్లిన జై శంకర్.. చైనాలో మొదలైన టెన్షన్..?

praveen
భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఓవైపు సరిహద్దుల్లో చైనా వేస్తున్న వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ ఎక్కడికక్కడ దెబ్బ కొడుతూ వరుస షాకులు ఇస్తుంది  భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు వివాదం తలెత్తి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా సరిహద్దుల్లో పరిస్థితులు హాట్ హాట్ గానే ఉన్నాయి. ఏ క్షణంలో యుద్ధం తలెత్తుతుందో  అనే విధంగానే ఉంది ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి.  అయితే ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.



 ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ చుట్టూ ఉన్న దేశాలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఈ క్రమంలోనే కీలక చర్చలు జరుపుతూ ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒక పటిష్టమైన లాబీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు ఆర్మీ అధికారులు మరోవైపు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంకోవైపు విదేశాంగ శాఖ జయశంకర్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పర్యటించి చైనా వ్యవహారాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చెప్పడమే కాదు ఇక ఆ తర్వాత జరగబోయే కార్యకలాపాలు ఎలా ఉండాలి అన్నదానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.



 ప్రస్తుతం ఆయా దేశాలతో వాణిజ్య పరమైన రక్షణ పరమైన సంబంధాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది భారత్. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ శ్రీలంకకు వెళ్లారు. అక్కడ చైనా వేరే దేశాల పట్ల అనుసరిస్తున్న విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించి స్నేహాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: