గ్రేటర్ యుద్ధం : పాతబస్తీలో హిందువులపై కుట్ర జరుగుతోంది - బండి సంజయ్
అలాగే బేగంపేటలో వైద్యులతో బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... పాతబస్తీ ప్రాంతంలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, తార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారు? అని ప్రశ్నించారు. వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? వాళ్ళ ఆస్తులను ఎవరు కబ్జా చేశారు? అని నిలదీశారు. పోలీసులు హీరోలు అన్నారు. అలాగే భాగ్యనగర్లో పోలీసుల్ని గెలిపిస్తే.. 24 గంటల లోపే పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని అన్నారు. పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి మరి వాళ్ళను తరిమేస్తామని అన్నారు.
భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమని అన్నారు బండి సంజయ్. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. అలాగే ఆస్తి పన్ను చెల్లించడం లేదు, ఆఖరికి నల్లా బిల్లులు కూడా చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో మీరు జల్సా చేస్తారా?'' అని ప్రశ్నించారు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికలలో బీజేపీకు అవకాశం ఇవ్వాలని వైద్యులను కోరారు. దేశంలో ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, మన ఈ హైదరాబాద్ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.