వదిలేలా లేదుగా.. మరోసారి వర్షాలు.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు..?
మరోసారి ఏపీ లోని పలు జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతం లో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈశాన్య రుతుపవనాలు ఈనెల 28వ తేదీన దేశంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. ఈశాన్య రుతుపవనాల వర్షాలు కోస్తా ఆంధ్ర తమిళనాడు పుదుచ్చేరి లతోపాటు కర్ణాటక కేరళ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ఇటీవలే బులెటిన్ కూడా విడుదల చేసింది.