తాజాగా ఆయన మరో కీలక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టారు. అదే జగగన్న విద్యాకానుక. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదివే విద్యార్థులకు రు. 650 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే, ఇది బీజేపీ నేతలు కార్నర్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సొమ్ములో ఎంత కేంద్రం ఇచ్చిందో చెప్పలేదు కానీ.. కేంద్రం డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రధాని మోడీ పేరు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. నిజానికి అదే సమయంలో ఈ పథకానికి ఎంత మేరకు నిధులు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించి ఉంటే బాగుండేదని అంటు