రక్షణ కల్పిస్తున్న వారికే రక్షణ కరువు.. 9500 మంది పోలీసులకి కరోనా..?

praveen
దేశంలో కరోనా వైరస్ ఏ రేంజిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం రోజుల వ్యవధిలో లక్షల కేసులు దాటిపోతున్నాయి. వెరసి రోజురోజుకు ప్రజల్లో భయం పాతుకు  పోతుంది. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి   వచ్చి నెలలు గడుస్తున్నా  వైరస్ కి ఎలాంటి వాక్సిన్  కూడా అందుబాటులోకి రాకపోవడంతో... ప్రజల్లో మరింత భయం  పెరిగింది. దేశంలో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండడం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి చేయి దాటి పోతుంది. రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.



ఆ రాష్ట్రంలో ప్రజలు రోజు రోజు దినదినగండంగా జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా  వైరస్ దాడి చేసి కాటికి పంపిస్తుందని భయంతోనే  బతుకును వెళ్లదీస్తున్నారు. కేవలం సామాన్య ప్రజలకే కాదు అధికారులు నాయకులను సైతం ఈ మహమ్మారి కరోనా వైరస్ వదలడం లేదు. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ కదిలిస్తుంది ఈ కరోనా రక్కసి . ముఖ్యంగా ప్రజలకు ధైర్యం చెబుతూ అవగాహన కల్పిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ శాఖ పై కరోనా వైరస్ తీవ్ర  ప్రభావం చూపుతుంది. దీంతో రోజురోజుకు మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీస్ అధికారుల సంఖ్య పెరిగిపోతుంది. అయినప్పటికి  పోలీసు అధికారులు మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.



ఇప్పటివరకు మహారాష్ట్రలో 9566 మంది పోలీసు సిబ్బంది కరోనా  వైరస్ బారిన పడినట్టు అధికారులు వెల్లడించగా... వీరిలో ఏకంగా 103 మంది ప్రాణాలు  కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 7534 మంది ఇప్పటికే కరోనా  వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకోగా  1929 మంది పోలీసు అధికారులు చికిత్స తీసుకుంటున్నటు  మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ముంబై-పూణే సహా ఇతర ప్రాంతాల్లో ఈ మహమ్మారి వైరస్ మరింతగా విజృంభిస్తుంది . దీంతో ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారులకు సైతం కరోనా  వైరస్ బారి నుంచి రక్షణ లేకుండా పోయింది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: