ఆస్తి కోసం తన బాబాయ్ ని చంపిన అన్నదమ్ములు ...!

Kothuru Ram Kumar

దేశంలో రోజురోజుకి మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా ఒకరిపై ఒకరు దూషించుకోవడం, కొట్లాడం వంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఆస్తుల కోసం, ఇక ఏదైనా అక్రమ సంబంధాల కోసం జరిగిన సంఘటనలే ఎక్కువగా కనబడుతున్నాయి. 

ఇక మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలా జరగడం సర్వసాధారణం అయిపోతుంది. ఇక దీనితో డబ్బు, ఆస్తుల కోసం కొన్ని ప్రాణాలు పోతున్నాయి కూడా. ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలోని హుబ్లీ ప్రాంతంలో జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆస్తి కోసం వారి సొంత బాబాయ్ ని కలిసి చంపేశారు. గత కొద్దిరోజులుగా ఆయనతో వారికి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. దీనితో వీరి ఇరువురి కుటుంబాల మధ్య అనేక సార్లు గొడవలు కూడా జరిగాయి. ఇక ఇదే క్రమంలో వారి బాబాయ్ ను చంపేస్తే ఆస్తి మొత్తం తమ సొంతం అవుతుందని చెన్నప్ప, బసవప్ప మాస్టర్ ప్లాన్ వేశారు.

 

 

అయితే సోమవారం నాడు ఉమేష్ ఒక పని అవసరం కోసం ఇంటి నుండి బైక్ పై బయటికి వచ్చాడు. ఇక ఇదే అదునుగా వేచిచూస్తున్న సోదరులు ఇద్దరు మార్గ మధ్యంలో కత్తులతో అతడిపై దాడికి దిగారు. ఇక అతనిని పట్టుకొని విచక్షణారహితంగా అతని శరీరంలో అనేక చోట్ల కత్తులతో పొడి చేశారు. ఇక తీవ్ర రక్తస్రావంతో ఉమేష్ సంఘటనా స్థలంలోనే అతని ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడ ఉన్న సీసీటీవీల ఫోటోలను పరిశీలిస్తూ వాటి ఆధారంగా కేసు నమోదు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: