మధ్యప్రదేశ్ అవ్వలేదు... గుజరాత్ కాంగ్రెస్లో పెను కల్లోలం....!
ఈ సంక్షోభం నేపథ్యంలో కమల్ నాథ్ సర్కార్ నుంచి ఆరుగురు మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు బీజీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కమల్ నాథ్ సర్కార్ రేపటి బలపరీక్షలో నెగ్గుతుందా ? లేదా ? అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్య ప్రదేశ్లో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కకుండానే కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ వంతు ఈ సారి వచ్చేసింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకోనుంది. అయితే ఇప్పుడు గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు సోమగంద, కేవీ కాకడీయ ఇప్పటికే రాజీనామా చేసేశారు. దీంతో ఈ లిస్టులో ఇంకెంత మంది ఉన్నారో ? తెలియక కాంగ్రెస్ అతలాకుతల మవుతోంది. తాము కోరుకున్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తికి రాజ్యసభ సీటు ఇస్తుందన్నందుకే ఈ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. ఏదేమైనా ఈ సంక్షోభం ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.