మీడియా గుసగస: ఆ టీవీ ఛానెల్ లేడీ యాంకర్కు అమరావతిలో ఫ్లాట్... ఆ గిఫ్ట్ సీక్రెట్ ఇదే...?
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు అమరావతి వైపే. ఓ వైపు రాజధాని తరలిస్తారా లేదా అనే ఉత్కంఠ మరోవైపు శాసనమండలి రద్దు అవుతుందా? సర్కారు దూకుడు కొనసాగుతుందా అనే ఆసక్తి. అయితే, ఇదే సమయంలో మరో సంచలన అంశం తెరమీదకు వచ్చింది. అమరావతి ప్రాంతంలో మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను ప్రభుత్వం బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ తవ్వకాల్లో ఓ మహిళ జర్నలిస్టు వ్యవహారం కలకలంగా మారింది.
మీడియా వర్గాల గుసగుసల ప్రకారం, ఒక సాధారణ మహిళా టీవీ రిపోర్టర్ అమరావతిలో ప్లాట్ కలిగి ఉన్నారట. అయితే, ఇది ఆమె సొంతం కొనుగోలు చేసింది కాదట. ఒక మీడియా అనుబంధ పెద్ద మనిషి సదరు మహిళా పాత్రికేయురాలికి ఈ గిఫ్ట్ అందించారట. ఇంతకూ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారంటే...అదే పెద్ద ట్విస్ట్. ఇప్పటివరకు ఆ విషయం ఇటు సదరు జర్నలిస్ట్ చెప్పడం లేదట...ఇచ్చిన వ్యక్తి సైతం నోరిప్పడం లేదంట.
ఇంతకీ ఈ గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారంటే..ఓ రెండు మూడు సంవత్సరాల కిందట. మీడియా రంగం నుంచి వచ్చిన గుర్తింపుతో ప్రభుత్వ పదవి పొందిన సదరు గిఫ్ట్ ఇచ్చిన పెద్దమనిషి ఇప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నాడంటున్నారు. అయితే, ఆకాశాన్నంటిన ధరలు ఉన్న అమరావతి వంటి ప్రాంతంలో ప్లాట్ కొనడం మాత్రం తేలిక కాదు. అలాంటిది ఓ ఫ్లాట్ కొని ఆమెకు గిఫ్ట్ ఇవ్వడం వెనుక సదరు వ్యక్తి ఉద్దేశం ఏంటి? ఈ గిఫ్ట్కు ముందు...తర్వాత ఏం జరిగింది? అనేది సహజంగానే..ఆసక్తిని రేకెతిస్తోంది. అదే సమయంలో....అమరావతిలో ఇప్పటికే కొన్ని ఆశ్చర్యకర ఘటనలు వెలుగులోకి రాగా...ఇలాంటివి ఇంకెన్ని వస్తాయో అంటూ పలువురు డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అనుకోకుండా సదరు గిఫ్ట్ ఆ ఫ్లాట్ విషయంలో సమాచారం సేకరించిన ప్రభుత్వం సదరు పాత్రికేయురాలిపై చర్య తీసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా? వేచి చూడాల్సిందే.