మాంసాహారాన్ని మద్యం ముట్టరు.. వంటిల్లు ఘుమఘుమ
పెద్దాపూర్ గ్రామస్థులు మల్లన్నను నమ్ముతారు. భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామం మధ్యలో మల్లన్న స్వామికి ఓ దేవాలయం కట్టారు. ఈ మల్లన్న దేవుడికి ఆదివారం అంటే ఎంతో ఇష్టం. అందుకే గ్రామస్థులంతా ఆదివారం నాడు మల్లన్నను భక్తి శ్రద్దలతో కొలుచుకుంటారు. ఆ రోజున మద్యంగానీ, మాంసం గానీ ముట్టరు. ఆదివారం వచ్చిదంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగనవారు ఉంటారు. వంటిల్లు ఘుమఘుమ సండే వచ్చిదంటే చికెన్.. మటన్, చేపల కూరల వాసనలతో వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంటుంది. కానీ ఓ ఊర్లో మాత్రం ఆదివారం మాంసాహారం వండితే జరిమానా వేస్తారు. ఈ ఆచారాన్ని ఒకటీ రెండూ వారాలు కాదు ఏకంగా 10 సంవత్సరాల నుంచి వస్తోంది ఆ ఆచారం. ఈ ఆచారం వెనుక ఓ నియమం ఉంది ఆ నియమం వెనుక భక్తి ఉంది. ఆదివారం మాంసం తినకూడదనీ.. మద్యం తాగకూడదని పది సంవత్సరాల నాడు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తామని తీర్మానించారు. ఇలా పది సంవత్సరాలుగా పాటిస్తున్నారు. ప్రతీ ఏటా మల్లన్నకు ఉత్సవాలు చేస్తారు పెద్దాపూర్ గ్రామస్తులు. అలా మల్లన్న స్వామిపై ఉన్న భక్తిశ్రద్ధలతో గ్రామస్తులెవ్వరు ఆదివారం నాడు మాంసం గానీ..మద్యం గానీ ముట్టరు.