శ్రీ రెడ్డి ఏంటి నీ బాధ ??
శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి నోరు విప్పితే చాలు .. తిట్టడమో, లేదా అంతకు మించి బూతులు అందుకోవడమో ఇవే వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి కాస్త డిఫరెంట్గా మాట్లాడింది .. శ్రీరెడ్డి కి పవన్ కళ్యాణ్తో కలిసి బాలీ, కొడైకెనాల్, కేరళ లాంటి ప్రాంతాల్లో బోటు షికారుకు వెళ్లాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది శ్రీరెడ్డి.
అయితేఅంతలోనే మల్లి ఓ ట్విస్ట్ ఇచ్చింది. జాలీగా బాలీ ట్రిప్ వెళ్లే ఛాన్స్ వచ్చే పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తాను. అక్కడ పవన్ కళ్యాణ్కి బుల్లెట్ కాఫీ, బాయిల్డ్ క్యారెట్లు ఇస్తా. అయితే పవన్ కళ్యాణ్ను అక్కడకు ఎందుకు తీసుకుని వెళ్తా అంటే.. అతనితో నాకు ఉన్న ప్లాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి. అతనితో రొమాన్స్ చేయడానికి కాదు.పవన్ కళ్యాణ్ ఎంతో మందితో రొమాన్స్ చేశారు.. నన్ను చేయరు అనడానికేం లేదు.
ఆయనతో నాకు శాశ్వత శత్రుత్వం నాకేం లేదు. నేను పోరాటం మాత్రమే చేశా. ఆయనకు కొన్ని సలహాలు మాత్రం ఇస్తా. మొన్నటి వరకూ నేను చిరంజీవిని నేనే ఏం అనలేదు. ఎప్పుడైతే నన్ను బ్లేమ్ చేశారు అప్పుడు వ్యతిరేకించా.పవన్ కళ్యాణ్లో అన్నీ పాజిటివ్స్ ఉన్నాయి అని అన్ని మైనస్లే అని కూడా అనను. . ఆయన పోరాటంలో నిజాయితీ నాకు ఇప్పటి వరకూ కనిపించలేదు.
ఆయన మారి అనుభవం ఉన్న నాయకుడు అని నాకు అనిపిస్తే.. తప్పకుండా సపోర్ట్ చేస్తా. ఆయన మంచి నాయకుడు అని అనిపిస్తే.. తప్పకుండా జనసేనలోకి వస్తానేమో. అయితే ఈ పది సంవత్సరాల్లో అయితే జనసేనలోకి వెళ్లే ఉద్దేశం లేదు. నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని, బ్లాక్ మెయిల్ చేయడం లేదు. వాళ్లు చేసిన తప్పుల్ని మాత్రమే గుర్తు చేస్తున్నా’ అంటూ బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.అయితే ఇదే ఇంటర్వ్యూ ప్రారంభంలో జనసేనలోకి వెళ్తారా అని యాంకర్ నూతన్ నాయుడు అడగ్గా.. ‘బుద్ధి ఉండగా చేయని పని అదొక్కటే.. బురద గుంటలోకైనా దూకుతా కాని ఆ పని మాత్రం చేయను అనింది