రెండో రాజధానిపై ..... క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి ...
తాజా సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని కిషన్రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యం, నదులు అనుసంధానంపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం, విద్య వంటి మౌలిక వసతుల కల్పనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయంమని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోసారి మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని, ప్రభుత్వం మొండి వైఖరి వీడి వారితో చర్చలు జరపాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్లు హామీ ఇవ్వలేదని, విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశాన్ని విభజన బిల్లులో సీఎం కేసీఆర్ ఎందుకు పెట్టించలేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు.