పచ్చని పొలాలతో, పైర గాలులతో, ప్రకృతి రమణీయతతో, ఏపీకి కొంగుబంగారంగా నిలిచిన ప్రాంతమది. వేలాది మంది రైతులకు జీవం పోసి, లక్షలాది మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా వెలుగులు వెలిగిన నేలది. అవశేష ఆంధ్రప్రదేశ్గా మారిన తరువాత అన్నపూర్ణగా విరాజిల్లిన నేల ఇప్పుడు ఎందుకు మోడుబారింది. మూడు పంటలకు నెలువైన నేల నేడు ఎందుకు ఎడారిగా మారింది. పచ్చని పంటపొలాలను విధ్వంసం చేసి, కాంక్రిట్ నిర్మాణాలకు కారకులైంది ఎవ్వరు. అన్నం పెట్టె అన్నపూర్ణ నేడు అన్నమో రామచంద్రా అని ఎందుకు అఘోరిస్తోంది.
దీనికి ఎవ్వరు కారకులు. పచ్చని పల్లెల ప్రాణం తీసిన పాపులు ఎవ్వరు. పంటపొలాలను ఆసరా చేసుకుని ఉపాధి పొందే యువతకు స్వయం ఉపాధి లేకుండా చేసిందేవ్వరు. పంట పొలాల్లో పండించిన పంటలతో, ధాన్యసిరులతో దర్జాగా బతికిన కర్షకులు, కౌలు కోసం కన్నీటి గోసకు కారకులెవ్వరు అనే ప్రశ్నలకు ఠక్కున సమాధానం వచ్చేది టీడీపీ అధినేత చంద్రాలు. ఆయన అనుచరులు, తాబేదార్లు, ఆయన పాలన. మరి పచ్చని పొలాలను ధ్వంసం చేసి, ఎడారిగా మార్చిన పాపులు ఇప్పుడు పునితులైనట్లు నీతులు వల్లిస్తుంటే ప్రజలు నవ్వకుంటున్నారు.. దెయ్యాలు వేధాలు వల్లిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చంద్రాలు అండ్ కో నీతులు చెపుతుంటే అలాగే ఉంది.
రాజధాని అమరావతి పేరు చెప్పి పంటపొలాలను నాశనం చేసిన నారా అండ్ బ్యాచ్ ఇప్పుడు దొంగ ఏడ్పులు చూస్తుంటే చూసేవారికి చిరాకేస్తుంది. చంద్రబాబు ఆయన ముద్దుల కొడుకులు అమరావతి పై చేసిన కామెంట్లు చూస్తే దొంగే దొంగ అని దొంగ ఏడ్పులు ఏడుస్తుంటే చూసేవారికే ఎబ్బెట్టుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తరువాత ఏపీకి ప్రత్యేక రాజధాని అవసరమే. రాజధాని నిర్మాణం చేస్తే ఎవ్వరు వద్దు అనరు. కానీ చంద్రబాబు అండ్ కంపెనీ మాత్రం రాజధాని తన ఇష్టమైన పద్దతిలో, ఇష్టారాజ్యంగా నిర్మించాలనుకుంది. దానికి ఓ పద్దతి అంటూ లేకుండా పనిచేసింది.
నాలుగేళ్ల క్రితం ఆర్భాటంగా రాజధాని నిర్మాణంకు పీఎం నరేంద్రమోడీ చేతులు మీదుగా శంకుస్థాపన చేయించారు. అయితే రాజధాని నిర్మాణం చేయాలనుకున్న ప్రాంతం ఎంపికే సరైంది కాదని ఆనాడే మేధావులు తేల్చారు. కానీ ఎవ్వరి మాటలు వినని చంద్రబాబు పట్టుపట్టి పచ్చటి పంట పొలాలను భూసేకరణ పేరుతో లాక్కుని, అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసంతో వేలాది ఎకరాలను సేకరించారు. ఇక 30వేల ఎకరాల భూముల్లో రాజధాని నిర్మాణం పేరుతో కట్టడాలను ప్రారంభించి అన్నపూర్ణ గుండెలపై కుంపటి పెట్టారు.
అదే భూముల్లో ఆకాశాన్ని అంటే భవనాలు నిర్మించేందుకు సిద్దమైంది చంద్రబాబు.. ఇప్పుడు అదే తండ్రి కొడుకులు ట్వీట్టర్లో వేసిన ఓ ఫోటో, కామెంట్ చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి శోభతో వెలుగులు వెలిగింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ దెయ్యాలు తిరిగే ప్రాంతం అన్నట్లుగా కామెంట్లు పెట్టారు. ఏకంగా ఓ పోస్టర్ను కూడా ట్వీట్టర్లో పోస్టు చేశారు. నాడు అపూర్వ నిర్మాణ శోభ.. నేడు స్మశాన వైరాగ్య క్షోభ అంటూ పోస్టర్ను పోస్ట్ చేశారు. మరి ఇది నిజమేనా చంద్రబాబు అండ్ లోకేషాలు.
వీరి వేశాలు కాకుంటే ఏంటీ మరి నాడు అపూర్వ నిర్మాణ శోభకు ముందు ప్రకృతి రమణీయతతో అలరారిన నేల. పచ్చటి పంట పొలాలతో కలకల లాడిన నేలను ఎడారిగా మార్చిందెవ్వరో ఈ అబ్బాకొడుకులు మరిచినట్లున్నారు. ఏమైనా అయ్యా కొడుకులు ట్వీట్టర్ లో పెట్టిన పోస్టుతో వారే అభాసు పాలవుతున్నారు అనుటలో ఎలాంటి సందేహాం లేదు. అందుకే అంటారు కీడేంచి మేలెంచాలని. చంద్రాలు, లోకేషాలు పోస్టు చేసిన ట్వీట్ వారు చేసిన పాపాలకు నిదర్శనంగా, రైతులకు చేసిన మోసానికి సాక్ష్యంగా నిలువెత్తు నిదర్శనంగా కట్టడాలు కనిపిస్తున్నాయి.