హైదరాబాద్ లో కాల్పుల కలకలం
బీఎం డబ్ల్యూ కారులో వచ్చి గన్ తో కాల్చుకున్న అశ్విన్ జైన్. వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారులో వచ్చి కాల్చుకున్న అశ్విన్ జైన్. నార్సింగ్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే అశ్విన్ జైన్ బంగారం వ్యాపారం చేస్తుంటారని..మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
ఈ ఘటన కొద్ది సేపటి క్రితమే జరిగింది కనుక పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది ఆత్మహత్యా..లేక అతనిపై ఎవరైనా కాల్పులు జరిపారా అన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.