ఐపీఎల్ 2024 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన తర్వాత, ప్లేఆఫ్ల పోరు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో CSK కనుక గెలిచి ఉంటే, అప్పుడు చాలా జట్లు కూడా నష్టపోయేవి.కానీ CSK ఓటమి అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లకు రిలీఫ్ ఇచ్చింది.అయితే ప్లేఆఫ్స్ కోసం చాలా జట్లు ఇంకా పోరులో ఉన్నాయి. నిన్నటి గెలుపుతో గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా రేసులో ముందుకొచ్చింది.అయితే ఈ ప్లేఆఫ్ల సమీకరణం ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం..గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు అనేది లేదు. 12 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ రెండు స్థానాలు ఎగబాకి ఇప్పుడు ఎనిమిదో స్థానంలో నిలిచింది. కేకేఆర్ మొదటి స్థానంలో, రాజస్థాన్ రెండో స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఆర్సీబీ ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ లాభపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో CSK గెలిచినట్లయితే, వారికి 14 పాయింట్లు ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో లక్నో, ఢిల్లీ, బెంగళూరులకు ప్లేఆఫ్ డోర్స్ దాదాపుగా క్లోజ్ అయ్యేవి. ఇప్పుడు చెన్నై, ఢిల్లీ, లక్నో పాయింట్లు సమానంగా ఉండటంతో నెట్ రన్ రేట్ బేస్ చేసుకొని మాత్రమే సీఎస్కే ఈ జట్ల కంటే ముందుంది. ఇలాంటి పరిస్థితిలో, చెన్నై తన తదుపరి రెండు మ్యాచ్లలో ఓడిపోతే, ఈ జట్లు 14 పాయింట్లతో ప్లేఆఫ్కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది. లక్నో, ఢిల్లీ 16 పాయింట్లకు చేరుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఈ జట్లు 12 మ్యాచ్లలో కేవలం 14 పాయింట్లను మాత్రమే కలిగి ఉన్నాయి.అదే సమయంలో, RCB ఇప్పుడు CSK కాకుండా, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తరువాతి రెండు మ్యాచ్లలో కనీసం ఒక మ్యాచ్లోనైనా ఓడిపోతే RCB నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండి పైకి పోతుంది.RCB తమ అన్ని మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. అయితే ఇటువంటి పరిస్థితిలో ఇతర జట్లు కూడా 14 కి మించి వెళ్లకపోతే RCB కి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి.