సంపాదకీయం: దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు - తల్లిని చూపుతూ మోడీపై విమర్శలు చేయటమా?
నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ గారికి క్యూలో నిలబడటం కొత్తగాదు. దానికి
నరేంద్ర మోడీ ప్రధాని కావటానికి పెద్ద తేడాబడదు. అందుకే నరేంద్ర మోడీ తల్లైనా అందరి లాగానే ఆమె క్యూ లో
నిలబడింది. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని. 2019లో ప్రధానిగా ఉన్నా, 2024లో బిజెపి సిద్ధాంతాల
ప్రకారం పదవి నుండి దిగిపోవచ్చు. అప్పుడు కూడా ఆయన తల్లి కుటుంబ సభ్యులు
క్యూలోనే నిలబడి వారి పనులు వారు నిర్వహించుకోవాలి.
ఎందుకంటే మోడీ జీవన విధానమే అంత. ఆయన నేహౄ గాంధి వాధ్రా నారా కుటుంబాల్లా పదవులకు అంటి పెట్టుకొని ఉండరు. వీరికి రాజకీయమే జీవితం రాజకీయమే వ్యాపారం. మోడీకి రాజకీయం ఆశయం, వ్యాపకం, పాషన్. మానసిన ఆనందం. అందుకే మోడీ చూసేది క్రింది స్థాయి జీవితాలను సాధారణ స్థాయికైనా తీసుకు రావటం. దానికి డబ్బు కావాలి. అందుకు మన బాబులు కోరితే అపాయింట్మెంట్ యివ్వకపోవచ్చు. అర్ధరాత్రి భారత్ లో పెట్టుబడి పెడతానంటే బిల్ గేట్స్ దగ్గరికైనా వెళ్ళి చేతులు కట్టుకొని ఆహ్వానిస్తారు. తేడా కొడితే జింగ్ ను కూడా ఢీ కొంటారు.
ఎందుకంటే ఆయన పోతే ఆయన కొచ్చే నష్టం ఏమీ లేదు. దేశం బాగుంటే చాలు! నిరుపెదరికం అనుభవించి అందులో నుంచి పైకి లేచిన క్షిపణి నరెంద్ర మోడీ - అందుకే అమ్మ అన్నం వండి పోయ్యిని గొట్టంతో ఊదుతూ ముఖంపై బూది నుసి పడిన తల్లి ముఖం చూసిన తనయుడు. అందుకే కాంగ్రెస్ దాదాపు ఆరు దశాబ్ధాల్లో చేయలేని ప్రజా సేవ పదవిలోకి రాగానే పదమూడు కోట్ల గాస్ కనక్షన్లు అందిస్తూ మాతృమూర్తులు, సోదరీమణుల ఆర్తి తీర్చే పనిలో పడ్డారు. తన బావ చెల్లెళ్ళు చేసిన ఆర్ధికనేరాలను కప్పి పుచ్చటానికి రాజకీయాల్లోకి రాలేదు. తన కొడుకును తన తరవాత ముఖ్యమంత్రిని చేయటానికి ప్రయత్నించలేదు. హెరిటేజ్ లాంటి వ్యాపార సంస్థలను భార్యా కోడళ్లతో నిర్వహింపజేస్తూ వారికి రాజకీయ రక్షణవలయం కలిపిస్తూ దేశంలోని డైరీ వ్యవస్థలను పాడి పాల పరిశ్రమలను నిర్మూలించలేదు. సహకార సంఘాలను ఆచూకి లేకుండా చేయలేదు.
భారత్ గుర్తుంచుకోవలసిన ప్రధాన మంత్రులు ఇద్దరు మాత్రమే ఒకరు
లాల్ బహదూర్ శాస్త్రి, మరొకరు నరేంద్ర మోడీ. ఇద్దరూ పాతాళం నుండి ఆకాశం వైపుకు దూసుకు
వచ్చినా జీవితాన్ని మార్చుకోలేదు. ఏదైనా మార్పు వచ్చినా అది దేశం అవసరాలకు ప్రాతినిధ్యం
సరిగా ఉంచటానికే. అది కొడుకు పదవి వలన వచ్చిన
మార్పు కాదు! దాన్ని రాహుల్ గాంధి చంద్రబాబు ఎత్తిపొడవ అక్కర్లేదు. ఒకరు బంగారు చంచా
నోట్లో ఉండి పుట్టారు. మరొకరు వెన్నుపోట్లతో బంగారు చంచా నోట్లో పెట్టుకున్నారు. క్షేత్ర
స్థాయి నిజాలు తెలిసిన శాస్త్రీ-మోడీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అనేది నమ్మకూడని విషయం.
మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చంద్రబాబు 2019లో అధికారంలొకి రారని చెపుతున్నారు విశ్లేషకులు సర్వే సంస్థలు. ఒకవేళ చంద్రబాబు అధికారం లోకి వస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉంటే మరోసారి ఏపి ప్రజలకు మరో ఐదేళ్లు ఇబ్బందులు తప్పవు. అంతే కాదు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాహుల్ గాంధి ప్రత్యేక హోదా యివ్వలేకపోవచ్చు. కారణం బిహార్ ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు తమిళనాడు పశ్చిమ బెంగాల్ కూడా ప్రత్యేక హోదా కోరే అవకాశాలు పుష్కళంగా ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Modi
-
Lokesh
-
Narendra Modi
-
2019
-
House
-
Chief Minister
-
Bharatiya Janata Party
-
Culture
-
Narendra
-
Lokesh Kanagaraj
-
CBN
-
venkaiah naidu
-
YCP
-
Janasena
-
Janasena Party
-
Jagan
-
Wife
-
Cinema
-
India
-
Congress
-
Service
-
aarthi
-
Heritage Foods
-
rahul new
-
rahul
-
K L Rahul
-
Rahul Sipligunj
-
gold
-
Survey
-
Andhra Pradesh
-
Uttar Pradesh
-
Tamilnadu
-
West Bengal - Kolkata
-
vidya
-
Prime Minister
-
sampada
-
Cheque