సర్వే రిపోర్ట్: టీడీపీ లో ఆ పది మందికి ఓటమి తప్పదా...!
ఎన్నికలు దగ్గర పడటం తో అధికార, ప్రతి పక్ష పార్టీలు తాము గెలుస్తామా.. లేదా ఓడి పోతామా అని ఇప్పటి నుంచే వారికి భయం పట్టుకున్నది. అయితే పార్టీ విజయం సంగతి పక్కన పెడితే తమ నియోజక వర్గం లో తాము గెలుస్తామా అని టీడీపీ లో అందరికీ గుండెల్లో దడ పుడుతుంది. అయితే తాజా గా సర్వే ప్రకారం టీడిపి లో పది మంది మంత్రులకు ఓటమి తప్పదు అని రిపోర్ట్స్ వచ్చాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.
అయితే, ఇంటలిజెన్స్ నిఘా ప్రకారం వచ్చే ఎన్నికల్లో పది మంది మంత్రులు ఎదురీదుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.వీరి గెలుపుకు వైసీపీ,జనసేనలు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తుంది. ఆ పదిమంది మంత్రుల నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చీలే అవకాశం ఉందని,ఈ కారణంగా గెలుపు అంత సాధ్యం కాదని ఇంటలిజెన్స్ నిఘాలో వెల్లడైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో సీఎంతో కలుపుకుంటే మొత్తం 23 మంది మంత్రులు ఉండగా,వారిలో యనమల రామకృష్ణుడు,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,నారాలోకేశ్,నారాయణలు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.ఇక వీరిని మినహాయిస్తే,మిగిలిన 18మంది మంత్రుల్లో 10 మందికి గడ్డుపరిస్థితి ఎదురయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయన్నది వాదన.వీరు గెలవాలంటే,గట్టిగా చెమటోడ్చాల్సిందేనని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
నిఘా వర్గాల రిపోర్ట్ మేరకు, కిమిడి కళా వెంకట్రావు,పితాని సత్యనారాయణ,కొల్లు రవీంద్ర,ప్రత్తిపాటి పుల్లారావు,భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి,కేఈ కృష్ణమూర్తి,నిమ్మకాయల చినరాజప్ప,చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు మరో మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం.ఈ మంత్రుల నియోజకవర్గాల్లో పెద్దఎత్తున వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు వినికిడి. వీరి నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి జరగకపోవడం ఒక కారణం అయితే, అన్నింటికీ మించి సామాజిక సమీకరణాలు వీరి ఓటమికి కారణంగా నిలుస్తాయన్నది ప్రధాన వార్త.