దేశంలో ఎండలు మండిపోతున్నాయి..భానుడు వేడికి భూమిపై జీవరాశి అతలాకుతలం అవుతుంది. ఓ వైపు ఎండ తాపం..మరోవైపు దాహం..దీంతో ఏకంగా జనావాసల మద్యకు వచ్చిందో త్రాచుపాము. ఆ పామును చూసి గుండె గుభేలుమని ఒక్కోక్కరు పరుగులు తీశారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ పాముకు ఏకంగా వాటర్ బాటిలతో నీరు తాపించి దాని దాహార్తిని దీర్చాడు. వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని కైగా అనే కరువు గ్రామంలో ఓ కింగ్ కోబ్రా కనిపించింది. స్థానికులు దానినిపట్టుకున్నారు. పాపం ఆ పాము దాహంతో ఉన్నట్టు గ్రహించారు.
వాటర్ బాటిల్తో ఒక వ్యక్తి నీళ్లు పడుతుంటే ఎంచక్కా పడగ విప్పి నోటితో తాగింది. సామాన్యంగా జనసంచారంలోకి వచ్చేందుకు భయపడే పాములు… చుట్టుపక్కల జనం గుమికూడి ఉన్నాకూడా ఈ పాము ముందు దాహం తీర్చుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. కైగా పట్టణంలో కరువు తాండవం చేస్తోంది. తాగేందుకు మంచి నీటి దొరక్కా ప్రజలు ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నారో అక్కడి జంతువులు కూడా నీరులేక అల్లాడి పోతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ 12 అడుగులు పాము నీటికోసం వచ్చిన పాము దాహాన్ని తీర్చడం అది కూడా వాటర్ బాటిలతో..ఇంకేముంది ఈ తతంగం వీడియో తీయడం యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. పాము నీళ్లు తాగుతూ గుటకలు వేయటం వీడియో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది.