చంద్రబాబు పాలన పై ‘చిరు’ చురకలు

Chowdary Sirisha
కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు అయిన మెగాస్టార్ చిరంజీవి చాన్నాళ్ళ తర్వాత మరలా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానాలలో చక్కర్లు కొట్టడం మినహా ఏ పనీ చెయ్యటంలేదని తీవ్రంగా విమర్శించారు. అలాగే రుణమాఫీపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని చిరంజీవి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అధ్వాన్నంగా ఉందని తెలిపారు. ఇక వంద రోజుల పండుగను సినిమాలలో చేసుకుంటారని, అధికార పక్షం అయిదేళ్ళ పాలన ఉండగా వందరోజులకే సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందని చిరంజీవి ఎద్దేవా చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచెయ్యటం లేదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: