ఉద్యోగులకు గుడ్ న్యూస్..వాటి చెల్లింపులో మార్పులు..

Satvika
ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో చిన్న కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్‌కి ఒకేసారి చెల్లింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం త్వరలో నిబంధనల ను మార్చనుంది. ప్రస్తుతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ల కు వేర్వేరుగా విరాళాలు అందిస్తున్నాయి. 10 నుంచి 20 మంది కార్మికులు ఉన్న యూనిట్లకు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇతర ప్రయోజనాల కోసం 10 నుంచి 12 శాతం కంట్రిబ్యూషన్‌ను నిర్ణయించే అవకాశా లు ఉన్నాయి. ప్రస్తుతం EPFO, ESIC పార్టనర్స్ తో కీలక చర్చలు జరుగుతున్నాయి.

ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. సామాజిక భద్రతా కోడ్ 2020 ప్రకారం వివిధ సామాజిక భద్రతా పథకాల కింద కవరేజీని పెంచడానికి ప్రభుత్వం కొత్త పథకాలను రూపొందించవచ్చు. ఇది కాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పథకంలో మార్పులు, చేర్పులని కూడా చేయవచ్చు. ఇప్పటివరకైతే యజమానులు జీతం లో 3.25 శాతం ఇఎస్‌ఐసి ఫండ్‌కు, ఉద్యోగుల జీతంలో 0.75 శాతం జమ చేస్తున్నారు.

ప్రస్తుతం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఉద్యోగు ల బీమా కోసం ESIC పథకం కింద సహకారం అందించవచ్చు. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉంటే EPFO కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాల కోసం విరాళాలు చెల్లించాలి. ఇది కాకుండా EPFO కింద కేంద్రం ఇప్పుడు ఉద్యోగుల పరిమితిని 20 నుంచి 10 కి తగ్గించడాన్ని పరిశీలిస్తోంది.. దీంతొ చిన్న కంపెనీలు కూడా ఈపిఎఫ్ఓ కిందకు వస్తాయి.. ఇలా చెయ్యడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: