బాబోరి రేవంత్ : సీనియర్ల విషయంలో వ్యూహం ఏంటి..?
ఈ అంశం గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ పొలిటికల్ కమిటీ భేటి జరిగింది. రేవంత్ కు కరోనా రావడంతో జూమ్ ద్వారా చేసిన సమావేశం హాట్హాట్గా సాగింది. పార్టీ యాక్షన్ ప్లాన్ కంటే ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లను కలుపుకుని వెళ్లాలని సూచించినట్టు సమాచారం. పార్టీలో ఎవరికి ఇబ్బంది ఉన్నా.. సోనియాగాంధీకి లేదా తనకు లేఖ రాయాలని సూచించారు.
అయితే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉంటున్నాయి. దీనికి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతూ కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నష్టం లేకున్నా.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న విషయం వారికి కూడా తెలిసిందే. అయినా, నేతల వ్యవహారంలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీకి గడ్డుకాలం తప్పదని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీని ముందుండి నడిపించాల్సి పీసీసీ చీఫ్ రేవంత్ సీనియర్లను మచ్చిక చేసుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.