నన్నెందుకు ఇరికించావంటున్న బట్టి..!
హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. దీన్ని బయటకు తీసుకువచ్చింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. ఉప ఎన్నిక తరువాత హరీష్ రావును బయటకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారని రేవంత్ బాంబ్ పేల్చారు. దీంతో కేటీఆర్ నాలుగు అడుగులు ముందుకేసీ ఈటల గెలిస్తే మాత్రం కాంగ్రెస్లోకి జంప్ చేస్తాడని చెబుతూ తన దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు. అలాగే, అతనితో పాటు మాజి ఎంపీ వివేక్ కూడా వెళ్లిపోడాని ఓ బాంబ్ వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరైన వాళ్లు లేరని బట్టి విక్రమార్క ఒక్కరే మంచివారని కితాబిచ్చారు.
దీంతో, ప్రతిపక్ష నేతను కేటీఆర్ పోగడం ఏంటని కొంపదీసి బట్టి విక్రమార్క గులాబీ కారు ఎక్కనున్నాడా అని అందరూ అనుకుంటున్నారు. కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే, ఈ మధ్య బట్టి వ్యవహార శైలీ కూడా తరచూ వివాదాస్పదం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే దళితబంధు కు సంబంధించి ఏ సమావేశానికైనా బట్టి హాజరవుతున్నారు. అంతే కాదు, బట్టి నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దళితబంధు అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు కూడా. ఈ క్రమంలో కేటీఆర్ బట్టిని పొగడంతో పాత కథలు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో ఆయన ఏం రిప్లే ఇవ్వడం లేదని కొందరు ఇవ్వరని కొందరు అనుకుంటున్నారట.