హైదరాబాద్‌లో వర్షంతో దారుణ ఘటన.. ఏకంగా ఏడుగు మృతి?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో వర్షం ఏకంగా ఏడుగురి ప్రాణాలు బలి తీసుకుంది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న  గోడ కూలి ఏడు మంది మరణించారు. ఈ ఘటనపై ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడు మంది చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడం తో ఒక్కసారిగా గోడ కూలినట్లు తెలిపిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డికు తెలిపారు.

భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో  ఏడు మంది మృతి చెందారని .. మరో నలుగురికి గాయాలైనట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: