లక్ష్మి పార్వతి: జనసేన అధినేతని ముంచుతోంది చంద్రబాబే..!

Divya
వైసిపి నాయకురాలు సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నిన్నటి రోజున కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మీడియా తో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు వ్యాఖ్యలు చేసింది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కపటం లేని మనిషి అని అలాంటి వ్యక్తి కేవలం చంద్రబాబును నమ్మే మోసపోతున్నారని కచ్చితంగా ఏదో ఒక రోజు జనసేన అధినేతను కూడా ముంచుతారని లక్ష్మి పార్వతి వెల్లడించింది.. అబద్ధాలు ఆడడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని కూడా వెల్లడిస్తోంది.

తన సొంత మామనే వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి చంద్రబాబు.. పిఠాపురంలో కాపులంతా ఐక్యమత్తంగా ఉండాలి.. భారీ మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థి వంగా గీతా ను గెలిపించండి అంటూ తెలియజేస్తోంది.. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చెప్పడం వల్లే పిఠాపురానికి వలస వచ్చారని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక నాయకురాలు వైసీపీ వంగా గీతా నే అంటూ తెలుపుతోంది లక్ష్మీపార్వతి. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారని. ఇది అప్పట్లో అందరికీ షాక్ ను కలిగించింది అంటూ తెలిపింది.

అందుకే ఈసారి ఎలాగైనా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా వెల్లడించింది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పిఠాపురంలో కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలా మంది నటీనటులను ,సెలబ్రిటీలను కూడా పవన్ కళ్యాణ్ తన గెలుపు కోసం దింపుతున్నారని.. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి వంగా గీత పవన్ పైన పోటీ చేస్తున్నట్లు దీంతో అక్కడ చాలా గట్టి పోటీ నెలకొంది.. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు అంటూ వెల్లడిస్తోంది లక్ష్మీపార్వతి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: