కరణం పోలిటికల్ స్ట్రాటజీ మళ్ళీ మారుతుందా?
ఆ ఎన్నికల్లో టిడిపి తరుపున చీరాల బరిలో నిలబడి మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే టిడిపి అధికారంలోకి రాకపోవడంతో కరణం మనసు కాస్త మారింది...అనూహ్యంగా తన తనయుడు వెంకటేష్కు వైసీపీ కండువా కప్పించి, తాను జగన్కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా కరణం వైసీపీ వైపుకు వెళ్ళడంతో టిడిపి శ్రేణులు షాక్ తిన్నాయి...అసలు టిడిపికి వీర విధేయుడు....చంద్రబాబుకు సన్నిహితుడైన కరణం పార్టీ మారతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా కరణం పార్టీ మారిపోయారు.
సరే పార్టీ మారక అక్కడ కరణంకు అంత సుఖం ఏమి లేదు. ఏదో అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి వ్యాపారాలకు, రాజకీయంగా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేవని తెలుస్తోంది. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో కరణం రాజకీయం ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. ఎందుకంటే అదే చీరాల సీటు కోసం మరో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కాచుకుని కూర్చున్నారు. ఇటు ఈ సీటు తనకే ఇస్తారని కరణంకు క్లారిటీ లేదు.