ఆకతాయిల నిర్లక్ష్యం.. ఎంత పని చేశారో తెలుసా?

Purushottham Vinay
చాలా మంది ఆకతాయిలు ట్రాఫిక్‌ నిబంధనలు అస్సలు పాటించారు. ఇక ఆ రూల్స్ ని పాటించడమేమో గానీ.. అతివేగం ఇంకా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అలాగే సీటు బెల్టు ఇంకా హెల్మెట్‌ పెట్టుకోకపోవడం లాంటి కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలుపుతున్నారు.అయినా వాటిని లెక్కచెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తూ కొందరు పెడచెవిన పెడుతూ రోడ్డుపై ఇష్టారీతిన తమ వాహనాలను నడుపుతున్నారు. ఇక రోడ్డుపై వాహనదారులు డ్రైవింగ్‌ చేసే సమయంలో నిర్లక్ష్యపు ధోరణిని వీడాలని అలాగే మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని పోలీస్ అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజలు ఏమాత్రం వినిపించుకోవడం లేదనే చెప్పాలి.ఇక ఇటీవల ముగ్గరు ఆకతాయి యువకులు రోడ్డు పై అతి వేగంతో ‍స్కూటీని నడపడమే కాకుండా ఓ ‍ప్రమాదానికి కారకులయ్యారు.చివరకి జైలు పాలయ్యరు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. జూలై 11వ తేదీన నార్సింగి సమీపంలో ముగ్గురు యువకులు ట్రాఫిక్‌ రూల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తమ ఇష్టారీతిగా డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నారు. అంతేగాక ఆ స్కూటీ మీద మొదట కుర్చున్న వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి స్కూటీని నడుపుతున్నాడు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి నిర్లక్ష్యం ఎలాంటి స్థాయిలో ఉందని.ఇక ఆ సమయంలోనే ఓ ముసలావిడ అటుగా రోడ్డు పక్కన నుంచి వెళ్తుంటే ఆమెను ఢీకోట్టి మరీ ఆ ఆకతాయిలు వెళ్లిపోవడం జరిగింది. కనీసం వారు కింద పడిని ఆ వ్యక్తి ఎలా ఉందో ఇంకా ఏమైందో అని కూడా చూడకుండా స్కూటీని ఇంకా వేగంగా కదిలించేశారు. అదృష్టవశాత్తు ఆ ముసలావిడ స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక ఇదంతా కూడా ఆ చుట్టు పక్కల వున్న సీసీ కెమరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ బైకుపై ప్రయాణించిన వారిలో ఇద్దరు దొరకగా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.ఒకసారి ఈ ప్రమాదాలు చిట్టాను పరిశీలిస్తే 2019 నుంచి 2021 మే వరకు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

https://youtu.be/vjRKAbxw_DM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: