విదేశాలకు వెళుతున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి... ?
* మీరు మీ టికెట్ము సమయానికి 6 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే కరోనా పిసిఆర్ పరీక్ష చేయనిదే అనుమతించడం లేదు. ఈ పరీక్షకు అక్కడ రూ. 4500 ల వరకు తీసుకుంటున్నారు. ఇది ప్రయాణికుడికి అదనపు భారం అవుతుంది.
* మీరు ఎప్పటికప్పుడు మీరు వెళ్లాల్సిన దేశాలు అమలు చేస్తున్న కరోనా మరియు వీసా నియమాలను తెలుసుకుంటూ ఉండాలి. తెలియకుండా అక్కడకు వెళ్లి ఇబంది పడడం కన్నా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడడం సబబు.
* ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ అన్ని దేశాలకు అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తించుకుని ముందుగానే టికెట్ లను బుక్ చేసుకోవడం మంచిది.
* అంతే కాకుండా ఒక్క రోజు ముందుగా ఎయిర్పోర్ట్ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి నిబంధనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని తెలుసుకుని వెళ్లడం ఉపయోగకరం.
* కరోనా ముందు వరకు ఏమయినా రూల్స్ మారి ఉంటే ఎయిర్లైన్స్ వారు మెసేజ్ ద్వారా తెలియచేసే వారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి అలెర్ట్ గా ఉండడమే మంచిది.
మరి విదేశాలకు వెళ్లాల్సిన వారు ఈ విషయాలను గుర్తుంచుకోండి.