చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ లో పాపులర్ అవ్వాలంటే ముందు తెలుగు, తమిళ సినిమాలతోనే మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అందుకే ముందు సౌత్ సినిమాలలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు. ఇప్పుడు తాప్సీ పన్ను కూడా ఇదే లిస్ట్లోకి వచ్చింది. తెలుగులో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాధం సినిమాతో తాప్సీ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికి అంతగా గుర్తింపు పొందలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం తాప్సీ మంచి ఛాన్స్లే దక్కించుకుంటోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటు స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకుంది. దీంతో బాలీవుడ్లో వరుస అవకాశాలు రావటంతో తాప్సీ పలు సందర్భాల్లో తెలుగు సినీరంగంపై నోరు పారేసుకుంది.
ఇక్కడ హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వరని, కేవలం గ్లామర్ డాల్స్గానే చూస్తారంటూ కామెంట్ చేసింది. అంతేకాదు దర్శకేంద్రుడు తెరకెక్కించిన ఝుమ్మంది నాధం పాటపై ఓ మీడియా సమావేశంలో వెటకారంగా మాట్లాడి విమర్శలపాలైంది. తరువాత ఒకటి రెండు సౌత్ సినిమాలు కూడా చేసిన ఇప్పుడు కొత్తగా మాట్లాడుతోంది. కెరీర్ స్టార్టింగ్లో కథల ఎంపికలో తప్పుగా నిర్ణయాలు తీసుకుందట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఆ పరిస్థితులు పెద్దగా తెలియకపోవటంతో వేరే వాళ్లు చెప్పే మాటలు విని సినిమాలు ఒప్పుకున్నాని, అయితే ఆ పాత్రలకు తాను సూట్ అవ్వనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాని వెల్లడించింది.
అంతేకాదు కెరీర్ స్టార్టింగ్లో తనపై ఐరన్ లెగ్ అనే ముద్రవేశారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాత్రల ఎంపికలో తన సొంత తెలివి తేటలను మాత్రమే నమ్ముకుంటున్నానన్న తాప్సీ, ఇక మీదట పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తాప్సీ భూమీ పడ్నేకర్తో కలిసి నటించిన సాండ్ కీ ఆంఖ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. బయోగ్రాఫికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు తుషార్ హీరానందాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తాప్సీ, భూమీలు వృద్దురాలైన షార్ప్ షూటర్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.