పరారీలో ఉన్న బండ్లగణేష్..?
దీంతో కేసు నమోదు కావడంతో తన అనుచరులతో కలిసి బండ్లగణేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బండ్ల గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగు పెట్టి...అనేక సినిమాలలో నటించి మెల్లమెల్లగా..పౌల్ట్రీ వ్యాపారాలు చేస్తూ..నిర్మాతగా మారడం జరిగింది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో అనేక సినిమాలు నిర్మించడం జరిగింది.
అంతేకాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా అడుగు పెట్టడం జరిగింది. కానీ కాలం కలిసి రాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో కమెడియన్ గా రీఎంట్రీ...ఇచ్చాడు బండ్ల గణేష్. ఇటువంటి నేపథ్యంలో బండ్ల గణేష్ పై పీవీపీ కేసు పెట్టడంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.