విబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏటా లాగే ఈఏడాది కూడా సినిమా అవార్డులు అందించారు. అలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులకు టెక్నీషియన్లను ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు ఇప్పుడు గత రెండు ఏళ్ళగా నుంచి వెండి తెర అవార్డులను కూడా అందించడం విశేషం. ఈ సంవత్సరం ఇద్దరు సీనియర్ అలనాటి హీరోయిన్లకు ప్రధాన్యతనిస్తూ ఒకరికి లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును, మరొకరికి లెజండరీ అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని శిల్పకళావేదికలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో...
జమున మాట్లాడుతూ... మా విష్ణుగారు నన్ను ప్రత్యేకించి గౌరవించి నాకు ఈ అవార్డును ఇస్తున్నందుకు ఆయనకు ముందుకు నా థ్యాంక్స్. నా కూతురు జయసుధకి పండంటికాపురం చిత్రంలో పన్నెండేళ్ళ పిల్ల నా కూతురుగా అందులో నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెకు నా హృదయపూర్వక ఆశీస్సులు. గిరిబాబుగారు నా పక్కన ఎన్నో చిత్రాల్లో నటించారు. విలన్గా, కొడుకులా, హీరోలా ఇలా ఎన్నో పాత్రల్లో చేశారు. బాబుమోహన్ మంచి హాస్యనాటుడే కాదు ఆయన చాలా మంచి దిట్టమైన రాజకీయనాయకుడు కూడా విష్ణుగారి ఆధ్వర్యంలో నాకు ఈ లైఫ్టైమ్ ఎజీవ్మెంట్ అవార్డు రావడం ఎంతగానో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు అని అన్నారు.
జయసుధ మాట్లాడుతూ... వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా ఆ దేవుడికి నా కృతజ్ఞతలు. పన్నెండేళ్ళ వయసులో పండింటి కాపురం చిత్రంలో నేను జమునమ్మకు కూతురుగా నటించాను. మళ్ళీ తిరిగి నలభై ఏళ్ళ తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకుకోవడం చాలా గర్వంగా ఉంది. అంటే ఎంత మంచి అవకాశం ఇంత మంచి అవకాశం కల్పించింది దేవుడే కదా అందుకే దేవుడికి నా థ్యాంక్స్ అన్నారు. నేను ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో పనిచేస్తూ చాలా మంది దగ్గర డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సీనియర్ ఆర్టిస్టుల దగ్గర చాలా నేర్చుకున్నాను. ముందుగా అమ్మ దగ్గర డిసిప్లైన్ నేర్చుకున్నాను. ఈ అవార్డులు మాకు ఒక రివార్డుల్లాగా మమ్మల్ని గౌరవించడం చాలా అద్భ/తంగా ఉంది. నరేష్ కాల్ చేసి నాకు విబిఎంటర్ టైన్మెంట్స్ గురించి తెలిపారు. నాకు ఈ అవార్డుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.