ఉయ్యాలా .. జంపాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తరువాత సినిమా చూపిస్త మావ , కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఈక్రమంలో వరుసగా ఆఫర్లు రావడంతో స్టోరీ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఏడు సినిమాలు చేయగా ఆసినిమాలన్ని డిజాస్టర్లు అయ్యాయి. దాంతో ఈహీరో కెరీర్ సందిగ్ధం లో పడింది. అయితే ఆ ఏడు సినిమాలు చేసే క్రమంలో రెండు మంచి సినిమాలను వదులుకున్నాడు రాజ్ తరుణ్.
అందులో ఒకటి శతమానం భవతి కాగా రెండవది టాక్సీవాలా. శతమానం భవతి ముందుగా రాజ్ తరుణ్ కు వచ్చింది అయితే వేరే సినిమాలతో బిజీ గా ఉండడంతో ఈ ఆఫర్ కాదన్నాడు. ఆ తరువాత ఈసినిమా సాయి ధరమ్ తేజ్ దగ్గరికి వెళ్ళింది. అతను నో చెప్పాడు. చివరగా శర్వానంద్ ఓకే చెప్పడంతో సినిమా అలా పట్టాలెక్కింది. ఇక ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈసినిమా రాజ్ తరుణ్ చేసున్నా ఖచ్చితంగా అంతే హిట్ అయ్యేది. ఎందుకంటే అందులో కంటెంట్ అంత బలంగా వుంది.
ఇక టాక్సీవాలా విషయానికి వస్తే ఈ స్టోరీ ని కూడా ముందు రాజ్ తరుణ్ కే వినిపించారు. అయితే అతను నో చెప్పడంతో విజయ్ దేవరకొండ తో తీశారు. ఈ సినిమాకూడా హిట్ అయ్యింది. అయితే టాక్సీవాలాలో మాత్రం రాజ్ తరుణ్ నటిస్తే హిట్ అవుతుందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసినిమా విడుదలయ్యే సమయం లో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లో వుంది. ఆలా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాగా వరుస పరాజయాలను చవి చూసిన రాజ్ తరుణ్ కొన్ని నెలలు బ్రేక్ తీసుకోని మళ్లీ ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈహీరో కృష్ణ డైరెక్షన్ లో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.