కొత్త డైరెక్టర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..!
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత కొద్ది నెలల నుండి జరుగుతుండగా మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా తరువాత సాయి ధరంతేజ్ ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు అతడు చెప్పిన కథకి సాయిధరమ్ తేజ్ ఫిదా అయినట్లు దీంతో ఆ ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే సదరు కొత్త డైరెక్టర్ గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల, మజ్ను వంటి సినిమాలను దర్శకత్వం చేసిన విరించి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సుబ్బు కు తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
సుబ్బు చెప్పిన స్టోరీ లో మంచి స్కోప్ ఉండటంతో ఈ సినిమాలో తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో సినిమాకి సాయి ధరంతేజ్ ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ లో టాక్. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎక్కడా కూడా బయటకు రాలేదు. అయితే ఒకవేళ సినిమా కన్ఫర్మ్ అయితే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. చూడాలి మరి మీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో..?