ఫ్యామిలీ స్టార్ తో పాన్ ఇండియా మూవీ నిర్మించబోతున్న దిల్ రాజు..!!
తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండనుంది. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా .కిరణ్ అబ్బవరం హీరోగా, రహస్య గోరక్ హీరోయిన్గా 2019లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న కిరణ్, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన కొత్త ప్రాజెక్ట్ను రవికిరణ్ కోలాతో చేయబోతున్నట్లు గతేడాది సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన అనంతరం కొత్తగా ఎటువంటి అప్డేట్ను ఇవ్వలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకుంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వచ్చే ఈ ప్రాజెక్ట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్నాడు. రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను మే 09న ప్రకటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి అంటూ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లు రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకుడిగా విజయ్ నటించిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం పరాజయం పాలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా దిల్ రాజు విజయ్తో మరో సినిమా చేయడం విశేషం. ఆయన మాటిచ్చినట్టుగానే విజయ్తో రెండో సినిమా చేస్తున్నారు. మే 9న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని సమాచారం.