పవన్ ఫ్యాన్స్ కు పండగే.. పండగ!! ఈ న్యూస్ నిజమైతే..!

Murali
BREAKING NEWS : Power Star #PawanKalyan signed " Biggest & High Budget Mass Entertainer " flick ! Announcement is on the way. pic.twitter.com/mzFXSpWKgY

— Umair Sandhu (@UmairFilms) July 3, 2019

టాలీవుడ్ లో హిట్స్ కు, ప్లాప్స్ కు అతీతంగా కలెక్షన్లు సాధించే ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన బొమ్మ తెర మీద చూస్తే అభిమానులకు పూనకాలు, పేరు వింటే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకే పవన్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే ఉంటారు అని అంటూంటారు. ఇంతటి మాస్ క్రేజ్ ఉండి కూడా ఆయన సినిమాలకు బ్రేక్ వేసేశారు. జనసేన పార్టీ స్థాపించి 25ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చాలా సార్లు చెప్పారు. సినిమాలు చేయనని కూడా చెప్పారు. అయితే.. ఆయన సినిమా రీఎంట్రీపై ఇప్పుడొక న్యూస్ వైరల్ అవుతోంది.

 

ప్రముఖ యూకే సెన్సార్ బోర్డు మెంబర్ ఉమర్ సింధు పవన్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ రివీల్ చేశాడు. “పవన్ కల్యాణ్ ఒక భారీ మాస్ మూవీ చేయడానికి అంగీకరించాడు.. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది..” అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అభిమానులు కూడా పవన్ సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ నాగబాబును ఇందుకు ఒప్పించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలీదు కానీ.. ఈ వార్త నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే.. పండగ.

 

ఉమర్ సింధు పోస్ట్ ను కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు. సమీప భవిష్యత్తులో పవన్ సినిమాలు చేయకపోవచ్చు అని నాగబాబు ఒక ఇంటర్వూలో చెప్పాడు. కానీ.. తనకు రెండు సినిమాలు కమిట్మెంట్స్ ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో మెన్షన్ చేశారు పవన్. ఇటివల హరీశ్ శంకర్, బోయపాటిలతో సినిమాలు చేయబోతున్నారని కూడా గాసిప్స్ వచ్చాయి. మరి ఈ వార్తలో నిజముందో.. అబద్దమే ఉందో పవన్ మాత్రమే తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: