అలాంటి పరిస్థితి వస్తే పక్కవారి సహాయం కోసం వేచి చూడొద్దు... పూరి జగన్నాథ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ పాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి , టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల స్థాయికి ఎదిగిపోయాడు. ఇకపోతే సినిమాల ద్వారా జనాలకు పూరి జగన్నాథ్ ఎక్కువగా సందేశాలు ఇవ్వడు. ఆయన చెప్పాలి అనుకున్న దాన్ని సూటిగా చెబుతూ ఉంటాడు. దానిలో కొంత మంచి , కొంత చెడు కూడా ఉంటుంది.

ఇలా జనాలకు సందేశాలు ఇచ్చే సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ రావడంతో ఇండస్ట్రీ లో ఉన్న కమర్షియల్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. ఇకపోతే పూరి తన సినిమాల్లో హీరోలతో ఏ విధంగా అయితే స్ట్రాంగ్ మాటలను చెప్పిస్తూ ఉంటాడో ఆయన కూడా అప్పుడప్పుడు అదే విధంగా కొన్ని విషయాలపై స్ట్రాంగ్ గా తన ఒపీనియన్ వెల్లడిస్తూ ఉంటాడు.

ఇకపోతే తాజాగా పూరి మ్యూజింగ్స్ వీడియోలో భాగంగా ఈయన మాట్లాడుతూ ... శరీరానికి గాయం అయితే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో ఉంటుంది. రోజులు లేదా వారాలకు అది తగ్గిపోతుంది. ఒక సారి మనసుకు దెబ్బ తగిలితే దానిని మనమే నయం చేసుకోవాలి. రోజుల తరబడి ఏడుస్తూ ఉండకూడదు. అలాగే పక్కవారి సానుభూతి కోసం అస్సలు వేచి చూడొద్దు. త్వరగా మామూలు మనిషిగా మారాలి అని పేర్కొన్నారు.

ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరో గా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ కి కొనసాగింపుగా రూపొందుతోంది. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj

సంబంధిత వార్తలు: