గబ్బర్ సింగ్ వరకు శృతి హాసన్ కు పెద్దగా హిట్ లేదు. గబ్బర్ సింగ్
సినిమాతో మంచి విజయం దక్కించుకుంది. రేసుగుర్రం, శ్రీమంతుడు సినిమాలతో
హిట్ కొట్టింది. ఈ సినిమాల తరువాత మరలా ఈ అమ్మడు సినిమాలు చేయలేదు. ప్రేమ
పేరుతో శృతి లండన్ వెళ్ళింది.
కొన్నాళ్ళు అక్కడ
ఉన్న తరువాత తిరిగి వచ్చింది. ఇలా వచ్చిన ఈ అమ్మడు... ఇప్పుడు తిరిగి
సినిమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే శృతి తెలుగులో ఓ సినిమాకు
సైన్ చేసినట్టు తెలుస్తోంది. రవితేజ తో సినిమా చేసేందుకు సిద్ధం
అయ్యింది. రవితేజ హీరోగా మలినేని గోపీచంద్ తో సినిమాకు రెడీ అయ్యింది.
గతంలో
రవితేజ, శృతి, గోపీచంద్ కాంబినేషన్లో బలుపు సినిమా వచ్చింది. ఆ సినిమా
మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఇప్పుడు మరలా ఈ కాంబినేషన్ రిపీట్
కాబోతున్నది. ఎలా ఉంటుందో చూడాలి. అటు తమిళంలో కూడా శృతి షురూ చేసింది.
వరసగా
సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యింది. అంటే మరి కొన్నేళ్లు శృతి హాసన్
సినిమాల్లో కనిపిస్తుందన్నమాట. సో, మళ్ళీ టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి
సిద్ధంగా ఉన్నట్టే. మారేందుకు ఆలస్యం.. చకచకా సైన్ చేసుకుంటూ పొతే
పోలా..