పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మహేష్ బాబు కూడా చేస్తున్నాడా..?

KSK
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరికీ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన క్రేజ్ కలిగిన హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వాతావరణం నెలకొంటుంది. ఒక్కసారి హిట్ పడిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డులు మొత్తం తిరగరాయడం ఖాయం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గతంలో తన 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా విషయంలో విడుదల అవ్వక ముందే సినిమాపై భారీ అంచనాలు అభిమానులలో పెంచేసి..సినిమా విడుదల చేసి మొట్ట మొదటి వారంలోనే వీలైనంత వరకూ వసూలు రాబట్టాలని షోలు మీద షోలు వేయడం జరిగింది.


అయితే తీరా సినిమా మొట్టమొదటి షో పడగానే దారుణమైన ప్లాప్ టాక్ రావడంతో...సినిమా నష్టాలపాలైంది. అజ్ఞాతవాసి సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా అప్పట్లో రాలేదని ఇండస్ట్రీలో తెగ వార్తలు కూడా వినబడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమా మహర్షి చేయడం జరిగింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ‘అజ్ఞాతవాసి’ మాదిరిగానే మొదటి వారంలోనే వసూలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో దీనికోసం చాలా చోట్ల ఎక్కువ షోలకు పర్మిషన్ లు తీసుకోవడమే కాకుండా టికెట్ రేట్లను కూడా అమాంతం పెంచినట్లు టాక్ వినపడుతుంది. అయితే సినిమా ఏ మాత్రం మొదటి షో పడగానే పవన్ కళ్యాణ్ సినిమా మాదిరిగా నెగిటివ్ టాక్ పడితే మహేష్ ఈ సినిమా విషయంలో పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది అని ముఖ్యంగా మహర్షి సినిమా పై మహేష్ అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి అంటున్నారు సినిమా విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: