యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా సాహో. బాహుబలి సీరిస్ సినిమాల కోసం ఏకంగా ఆరేళ్ల పాటు టైం కేటాయించిన ప్రభాస్ ఈ రెండు సినిమాల తర్వాత సాహో సినిమా చేస్తున్నాడు. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగిందన్న లెక్కలతో సాహో నిర్మాతలు భారీ రిస్క్ చేసి సాహో మీద ఏకంగా ఇన్ని కోట్లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమా కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ప్రభాస్ అభిమానులే కాకుండా టోటల్ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. 2017లో బాహుబలి వచ్చాక మళ్లీ రెండు సంవత్సరాల పాటు ప్రభాస్ సినిమా రాలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తోన్న సినీ అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది.
సాహో షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్కు చేరుకుంది. ప్రస్తుతం ముంబైలో చివరి షెడ్యూల్లో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత ఓ డ్యూయెట్ కోసం యూరప్ వెళ్లడంతో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఈ షూటింగ్ ముగిసిన వెంటనే ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం అక్కడే కంటిన్యూ అవుతాడు.
ఇక ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్లలో రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్లు హోరెత్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా సాహో టీం ఆఘమేఘాల మీద పని చేస్తే కాని అనుకున్న డేట్కు థియేటర్లలోకి వచ్చే పరిస్థితి లేదు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.