ప్రేమ వెన్నెల.. రావె ఊర్మిల.. తేజ్ చిత్రలహరి సాంగ్ అదుర్స్..!

shami
మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజైంది. 


శ్రీమణి రాసిన ఈ పాటను సుదర్శన్ అశోక్ పాడారు. దేవి మార్క్ మెలోడీతో వచ్చిన ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తుంది. ప్రేమ వెన్నెల రావె ఊర్మిలా అంటూ సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శిల మధ్య ఈ సాంగ్ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉన్నట్టు అనిపిస్తుంది.


వరుస ఫ్లాపులు చేస్తూ వస్తున్న సాయి తేజ్ చిత్రలహరితో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కిశోర్ తిరుమల, సాయి తేజ్, దేవి కలిసి ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నారు. ఆల్రెడీ రిలీజైన మొదటి సాంగ్ గ్లాస్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ప్రేమ వెన్నెల సాంగ్ అదిరిపోయింది.


ఈ సాంగ్ దేవి తన రొటీన్ స్టైల్ ను కాకుండా కొత్తగా ట్రై చేశాడని చెప్పొచ్చు. కిశోర్ చేసిన మొదటి రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కాబట్టి ఈ సినిమా తేజ్ కు సూపర్ హిట్ పక్కా అంటున్నారు. ఏప్రిల్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మెగా మేనళ్లుడికి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: